Wednesday, December 20, 2017


రూ.2000నోట్ల ముద్రణ నిలిపివేత!
లేదంటే తక్కువ మొత్తంలో..
ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక
దిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసి ఉండడం లేదా తక్కువ మొత్తంలో ముద్రిస్తుండడం జరుగుతూ ఉండొచ్చని ఎస్‌బీఐ తన పరిశోధన పత్రంలో అంచనా వేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను అది వెల్లడించింది. ఆ వివరాలు.. 
* ఆర్‌బీఐ ఇటీవల సమర్పించిన నివేదికను పరిశీలిస్తే.. మార్చి 2017 వరకు చెలామణీలో ఉన్న చిన్న మొత్తం కరెన్సీ విలువ రూ.3,50,100 కోట్ల వరకు ఉంది. 
అంటే డిసెంబరు 8 నాటికి మొత్తం చెలామణీలో ఉన్న నగదులో నుంచి వీటి విలువ తీసివేస్తే.. అధిక విలువ గల నోట్ల మొత్తం విలువ రూ.13,32,400 కోట్లుగా ఉన్నట్లు తేలింది. 
ఆర్థిక శాఖ ఇటీవల లోక్‌సభకు సమర్పించిన గణాంకాల ప్రకారం.. డిసెంబరు 8 నాటికి 1695.7 కోట్ల రూ.500 నోట్లు; 365.4 కోట్ల రూ.2000 నోట్లను ఆర్‌బీఐ ముద్రించింది. వీటి మొత్తం విలువ రూ.15,78,700 కోట్లు. 
*ఈ లెక్క ప్రకారం.. ఆర్‌బీఐ వద్ద(సరఫరా కాకుండా) ఉన్న పెద్ద నోట్ల విలువ(15,78,700-13,32,400 కోట్లు) రూ.2,46,300 కోట్లు అన్నమాట. ఆర్‌బీఐ రూ.50, రూ.200 నోట్లనూ ముద్రించిన నేపథ్యంలో పై విలువ తక్కువైనదిగానే భావించాలి. 
రూ.2000 నోటు లావాదేవీల పరంగా సవాళ్లను విసురుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ రూ.2000 నోట్ల ముద్రణను నిలిపివేయడం లేదా ద్రవ్యలభ్యత పరిస్థితులు చక్కబడ్డ నేపథ్యంలో చిన్న మొత్తంలో ముద్రించడమో జరుగుతూ ఉండాలి. అంటే మొత్తం చెలామణీలో ఉన్న నగదులో చిన్న నోట్ల వాటా 35 శాతంగా(విలువ పరంగా) ఉంది.

పనితీరు లక్ష్యం చేరలేకపోయాయ్‌
చాలా వరకు బ్యాంకులు విఫలం
పూర్తి మూలధన సాయం అందబోదు
ఆర్థిక శాఖ వెల్లడి
దిల్లీ: పనితీరు లక్ష్యాన్ని చేరడంలో చాలా వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు విఫలమయ్యాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మూలధన సాయానికి ఉద్దేశించిన మొత్తం నగదును వాటికి ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇంద్రధనుష్‌ ప్రణాళిక ప్రకారం బ్యాంకులకు ప్రభుత్వం రూ.70,000 కోట్ల మూలధన సాయం చేస్తుంది. 2015-16; 2016-17లలో రూ.25,000 కోట్లు చొప్పున 2017-18; 2018-19లలో రూ.10,000 కోట్లు చొప్పున ఇవ్వాలి. ఇందులో ఇప్పటికే రూ.51,858 కోట్ల నిధులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చింది. 2016-17లో 13 బ్యాంకులకు రూ.22,915 కోట్లను కేటాయించింది. అందులో రూ.16,414 కోట్లను(75%) తొలి దశ కింద ఇవ్వగా.. మిగతా మొత్తాన్ని పనితీరు ఆధారంగా ఇస్తామని తెలిపింది. అయితే ఏ ఒక్క బ్యాంకూ తమ లక్ష్యాలను చేరలేకపోవడంతో మిగతా (25%) మొత్తాన్ని విడుదల చేయలేదని ఆర్థిక శాఖ తెలిపింది.
కాగా, బ్యాంకులకు మూలధన పునర్నిర్మాణ పథకం కింద రూ.2.11 లక్షల కోట్ల సాయం అందిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. ఇందులో రూ.1.35 లక్షల కోట్ల విలువైన రీక్యాపిటలైజేషన్‌ బాండ్లు ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాండ్ల జారీకి సంబంధించిన నిబంధనలపై ప్రభుత్వం పనిచేస్తోంది.
డియర్ కేటిఆర్ అంకుల్,
నా పేరు భూమిక. నా వయసు 8 ఏళ్ళు. ఉప్పల్ లో ఉంటాము.  జాన్సన్ అండ్ జాన్సన్ గ్రామర్ స్కూల్, నాచారం లో సెకండ్ క్లాస్ చదువుతున్నాను.  ఈ రోజు పొద్దున్నే నేను మా అక్క అమ్మతో కలిసి స్కూటీ మీద స్కూల్ కి వెళుతున్నాము. రోడ్డు మీద పెద్ద గుంత. అమ్మ బండి స్లో చేసింది. మా వెనక వస్తున్న లారీ అంకుల్ మా బండిని లారీతో గుద్దేసాడు. అంతే అమ్మ, నేను, అక్క కింద పడిపోయాం. నా తల బలంగా నేలకి గుద్దుకుంది. రక్తం కారిపోతోంది. అమ్మకి కూడా దెబ్బలు తగిలాయి, స్పృహ కోల్పోయింది. అక్కడ ఉన్న ఓ అంకుల్ నన్ను తన చేతుల్లో ఎత్తుకుని ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు, నా తల నుంచి రక్తం  కారిపోతూ ఉంది. ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి చేరాము, డాక్టర్లు నన్ను చూసారు. నేను చనిపోయానట .  అక్కడ నుంచి నన్ను గాంధీ ఆసుపత్రి మార్చురీకి  తీసుకెళ్ళిపోయారు. ఇంకొక్క అయిదు నిమిషాలు ఉంటే రోల్ నంబర్ 28 అంటే  హాజరు పలకాల్సిన నేను మార్చురీ లో 28 నంబర్ బాక్సులో శవంగా మిగిలాను అంకుల్.
ఇవాంకా వస్తోందని చాలా చోట్ల రోడ్లు బాగు చేసారట. మా కాలనీకి కూడా ఇవాంకా వచ్చి ఉంటె నేను బ్రతికేదాన్ని కదా అంకుల్. ప్రభుత్వాన్ని మేమేమైనా  వజ్ర వైడూర్యాలు అడుగుతున్నామా అంకుల్. గుంతలు లేని రోడ్లే కదా అడుగుతున్నాం. ఎన్ని నెలల నుంచి ఈ రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుసా అంకుల్. మీరు,  కెసిఆర్  అంకుల్ రోడ్లు బాగుచేయమని అధికారులకి చెప్పారని చాలా సార్లు పత్రికల్లో వచ్చింది. అయినా రోడ్లు బాగు కాలేదు. రోడ్ల మీద గుంతలు లేకుండా చేయడం ఏమైనా రాకెట్ సైన్సా అంకుల్. అదే మంటే అధికారులు బీటీ కి నీటికి పడదు అని సాకులు చెప్పి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దేశమంతా వర్షాలు పడడం లేదా అక్కడ బీటీ రోడ్లు లేవా? అక్కడ రోడ్లు ఇంత అధ్వాన్నంగా లేవు కదా అంకుల్.  అయినా మన  అసలు రోడ్లు వేసేటప్పుడు క్వాలిటీ ఉంటె కదా అంకుల్, కనీసం పదేళ్ళు ఉండాల్సిన రోడ్లు పది నెలలు కూడా ఉండడం లేదు. ఇంత నాసిరకంగా రోడ్లు వేసినందుకు ఒక్క ఆఫీసర్ మీద అయినా, ఒక్క కాంట్రాక్టర్ మీద అయిన చర్య తీసుకున్నారా? అధికారులకి మీరంటే భయం ఉంటె కదా అంకుల్ సరిగ్గా పనిచేయడానికి.
ఈ ఆఫీసర్లకి, కాంట్రాక్టర్లకి, నాయకులకి  కూడా పిల్లలు ఉంటారు కదా. రేపు వాళ్ళ పరిస్థితి అయినా ఇంతే కదా. ఎందుకు ఇంత చిన్న విషయం అర్థం కాదు. మాబోటి సామాన్యుల ప్రాణాలు అంటే అంత లోకువా అంకుల్. నేనే కాదు అంకుల్ ఇంకెంతో మంది నా లాగా యాక్సిడెంట్ లలో చనిపోయినవారి శవాలు ఇక్కడ కుప్పలుగా ఉన్నాయి. అంకుల్ నా చావుతో నైనా మన హైదరాబాద్ రోడ్లు బాగుపడాలి. మీరు చాలా సమర్థులు అని మీకు చాలా అవార్డులు వస్తున్నాయి. మీరు తలచుకుంటే  ఈ రోడ్లు బాగుపడతాయి. ఒక వారం కేవలం రోడ్ల సమస్య మీదే మీరు పనిచేయండి. పని చేయని అధికారులని  పీకి పారెయ్యండి. కాంట్రాక్టర్లు తప్పు చేస్తే శిక్ష వేయండి. ఏమైనా చేయండి. రోడ్లు మాత్రం బాగు చేయండి అంకుల్. మా అక్క, అమ్మ, నా క్లాస్ మేట్స్, నా లాంటి మరెంతో మంది పిల్లలు, పెద్దల ప్రాణాలు, ఆరోగ్యం  కాపాడండి. చివరిగా, నా తోటి పిల్లలకి నా విజ్ఞప్తి, బండి నడిపేవారే కాదు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోండి. కేటిఆర్ అంకుల్, మీరు మాత్రం మరో ప్రాణం బలికాకముందే రోడ్లు బాగుచేయించండి.
ఇట్లు,
ఎప్పటికీ మిమ్మల్ని చూడలేని..
భూమిక.
note: ఈ రోజు అంటే 19న ఉప్పల్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భూమిక, రహదారి భద్రత పై ప్రజల్లో అవగాహన  కల్పించేందుకు కృషి చేస్తున్న i am not an idiot సంస్థ వ్యవస్థాపకులు, లోక్ సత్తా పార్టీ నగర నాయకులు అయిన దోసపాటి రాము మేనకోడలు.


Wednesday, April 2, 2014

చెన్నంపల్లి కోటలో ‘సర్కార్‌’ దొంగలు. రాష్ట్ర సంపదను సాంతం నాకేస్తున్న పచ్చదొంగలు 
.
కోటలో గుప్తనిధుల వేట.. కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం
ప్రైవేటు ఏజెన్సీకి సీఎంఓ నుంచి గ్రీన్‌సిగ్నల్‌. లిఖితపూర్వక అనుమతులు లేకుండానే తవ్వకాలు. పురావస్తు శాఖకు సమాచారం లేదు.
నిధులున్నాయి.. తవ్వుకుంటాం అని ఓ ప్రైవేటు ఏజెన్సీ అడగ్గానే ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అనుమతించే సిందట. లిఖితపూర్వకమైన ఆదేశాలేవీ లేవు. ఈ అక్రమ తవ్వకాల వెనక అధికారపార్టీకి చెందిన పెద్దల హస్తం.

Sunday, December 12, 2010

Wednesday, November 24, 2010

హైదరాబాద్ ఎవరిది?


హైదరాబాద్ ఎవరిది?


తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను వేరు చేసి ప్రత్యేక ప్రాంతంగా చేయడమంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమే. ఇదెంత అమానుషం! సభ్యతా సంస్క­ృతి లేని వారు మాత్రమే ఇలా చేస్తారు.
మన ముఖ్యమంత్రి ఎన్నికలను ఎప్పుడూ ఒక క్రీడగా పోల్చుతారు. క్రీడా స్ఫూర్తితో పాల్గొంటే వచ్చే ఎన్నికలలో 'బంగారు పతకం' పొందడం ఖాయమని ఆయన పదే పదే అంటున్నారు. అయితే ఏ ఆటలోనైనా గెలవాలంటే ఆ ఆటలో విధిగా అనుసరించాల్సిన కొన్ని నియమాలు, ఒక క్రమ శిక్షణ ఉంటాయన్న వాస్తవాన్ని ఆయనగాని , ఎవరుగాని మరచిపోకూడదు. సరే, ఇటీవల గెలవడం ఒక్కటే క్రీడాకారులకు పరమ లక్ష్యం అయిపోయింది కదా. ఫుట్‌బాల్ వరల్డ్‌కప్- 2006లో గెలవడమే ఏకైక లక్ష్యంగా ఇటలీ జట్టు ఆడిం ది. ప్రధాన ప్రత్యర్ధి ఫ్రెంచ్ జట్టును రెచ్చగొట్టి ఇరుకునపెట్టే వ్యూహాన్ని అనుసరించి విజయా న్ని కైవసం చేసు కొంది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడటం ఖాయమైతే హైదరాబాద్ నగర ప్రతిపత్తి విష యమై మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ కాంగ్రెస్ నేత, రాయలసీమ నాయకులు ప్రారంభించిన చర్చ కూడా ఫ్రెంచ్ జట్టును ఓడించడానికి ఇటలీ జట్టు అనుసరించిన వ్యూహం వంటిదే. ఏదో ఒక విధంగా అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడం, కాదూ అంటే జాప్యం చేయడమే ఆ చర్చ లక్ష్యం. హైదరాబాద్‌పై చర్చ ఇప్పుడు రియల్టర్లు, భూమి మాఫియా, పేదల వ్యతిరేకుల స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా జరుగుతోంది! కనుక హైదరాబాద్ ఎవరికి చెందిందో అర్థం చేసుకోవడానికి తెలంగాణ, ఆంధ్రల చరిత్రను ఒక సారి పునరావలోకన చేయ వలసిన అవసరమెంతైనావుంది.
హైదరాబాద్ సంస్థానంలో మొత్తం 16 జిల్లాలు (8 తెలంగాణ , 5 మరఠ్వాడ, 3 కర్ణాట క) ఉండేవి. నిజాం ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం తెలంగాణ నుంచి సమకూరేదనడం లో ఎటువంటి సందేహం లేదు. నిజాం ఏజెంట్లు అయిన ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ జిల్లాల్లో తిరుగుబాటు ప్రజ్వరిల్లింది. ప్రజల తిరుగుబాటు నెదుర్కొనే క్రమంలో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎమ్ఐఎమ్) ఆవిర్భవించింది. 1944లో ఔరంగాబాద్‌కు చెందిన ఖాసిం రజ్వి మజ్లిస్ నాయకత్వాన్ని చేపట్టారు. పోలీసుచర్య అనంతరం రజ్వీని బీబీనగర్ దోపిడీ కేసులో విచారణ జరిపి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 1955లో విడుదలైన అనంతరం పాకిస్థాన్‌కు రజ్వీ పరారయ్యాడు.
పోతూ పోతూ మజ్లిస్ నాయకత్వాన్ని గుల్బర్గాకు చెందిన వహా బుద్దీన్ ఓవైసీకు అప్పగించి మరీ వెళ్ళిపోయాడు. హైదరాబాద్, తెలంగాణ ముస్లింలకు మజ్లిస్ పార్టీ నిజమైన ప్రతినిధేనా? ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో బస్సు డ్రైవర్లు, పోలీస్ కానిస్టేబుళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలలో క్లర్క్‌లు 50 శాతంకు పైగా మైనారిటీ మతస్తులే ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య కనీసం 15 శాతంగా కూడా లేదు! ఆ ఉద్యోగాలన్నిటినీ ఎవరు కైవసం చేసుకున్నారు? ఉర్దూ హైదరాబాద్‌లో ప్రధాన భాషగా ఉండేది. ఇప్పుడు దాని పరిస్థితి ఏమిటి? ముస్లింలైన యువతీయువకులు సైతం ఉర్దూను రాయడం, చదవలేక పోతున్నారే? ఈ పరి స్థితికి ఎవరు కారణం? తెలంగాణ ఏర్పడితే ముస్లింలకు భద్రత ఉండదని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.
ఏమి టి ఈ ప్రకటనకు అర్థం? హైదరాబాద్, తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఓవైసీపై ఉంది. తెలంగాణలోని ఫ్యూడల్ శక్తులకే కాక మతోన్మాద శక్తులకు కూడా కాంగ్రెస్ మద్దతునిచ్చిందన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ముస్లింల పాలన పునరుద్ధరణ అవుతుందని తెలంగాణ ప్రజ లను ఆంధ్రనాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని మజ్లిస్ అధినేత గమనం లోకి తీసుకున్నారా? ఇక హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి నగర అభివృద్ధికి తోడ్పడ్డామన్న ఆంధ్ర నాయకుల వాదనను పరిశీలిద్దాం. ఇదెంతటి అసంబద్ధ వాదన! అసలు రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చాల్సిన అవసరమేమిటి? హైదరాబాద్‌కు వచ్చి ఈ నగరాన్ని అభివృద్ధి చేయమని ఆంధ్ర నాయకులను ఎవరు అడిగారు? 400 సంవత్సరాల క్రితమే సకల హంగులతో నిర్మాణమైన నగరమొకటి ఉందనేకదా మీరు హైదరాబాద్‌కు వచ్చింది.

నిజం చెప్పాలంటే గత 40 ఏళ్ళుగా హైదరాబాద్ నగరం వికృతమయిపోతోంది. సరస్సులు, చెరువులు అన్నీ ఏమై పోయాయి? మధుర ఉర్దూ విన్పించడం లేదేమి? హైదరాబాద్, తెలంగాణలలో మతోన్మాద రాజకీయాలకు కారణమెవ్వరు? వక్ఫ్ భూములను కైవసం చేసుకొన్నదెవరు? తెలంగాణ భాషా సంస్క­ృతులను ధ్వంసం చేసిందెవరు? ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న మొత్తం 50 సెజ్‌లలో 40 ని కేవలం తెలంగాణ జిల్లాల్లోనే ఏర్పాటు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? వీధి దీపాలనే సక్రమంగా నిర్వహించలేని వారు గ్రేటర్ హైద రాబాద్‌ను ఏర్పాటు చేయడం సబబేనా? దాని వలన ప్రయోజనమేమి టి? మన దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్ళి స్థిరపడవచ్చు. జీనవోపాధి పొందవచ్చు.

హైదరాబాద్, తెలంగాణలలో తాము ఎలాంటి పాపాలకు పాల్పడకపోతే ఆంధ్ర నాయకు లు భయపడవలసిన అవసరమేముంది? మహారాష్ట్ర ఏర్పాటయినప్పుడు కూడా బొంబా యిని గుజరాత్‌కు ఇవ్వాలని గుజరాతీ వ్యాపారవర్గాలు వాదించాయి. నిర్దిష్ట ప్రాథమిక విషయాలు ఎప్పుడూ ప్రాథమిక విషయాలే. ప్రజలు వాటిని అర్థంచేసుకోకపోతే భగవంతుడే వారికి తోడ్పడాలి. హైదరాబాద్, రాయలసీమకు దక్షిణంగా 170 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రకు తూర్పుగా 200 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను ఏప్రాతిపదికన కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారు? ఎవరి ప్రయోజనాల కోసం? తెలంగాణ ఏర్పాటుకు కలతచెందవలసిన అవసరం దోపిడీదారులకు మాత్రమే ఉంది.

సామాన్య ప్రజలకు ఎటువంటి చింత ఉండనవసరం లేదు. ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, ఆల్వి న్ మొదలైన కంపెనీల మూసి వేతకు కారకులైన వారు మాత్రమే భయపడతారు. వారే మైక్రోసాఫ్ట్ కంపెనీకి వందలాది ఎకరాలను కట్ట బెట్టారు (ఆ కంపెనీకి అమెరికాలో 50 ఎకరాల ప్రాంగణం ఎక్కడా లేదు మరి! ). ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లను కబ్జా చేస్తున్నవారు, మెట్రో, రింగ్ రోడ్డు పేరిట హైదరాబాద్ ప్రజలకు ఉరికంబాలు నిర్మిస్తున్నవారు మాత్రమే ప్రత్యేక తెలంగాణ విషయమై భయపడాలి. సామాన్య ప్రజలకు ఎటువంటి కలవర పాటు అవసరం లేదు.

తెలంగాణ, హైదరాబాద్‌లలో ఆ మాటకొస్తే ఎక్కడైనా ప్రజలలో 90 శాతం మంచివారే. తెలంగాణకు ఒక ప్రత్యేక సంస్క­ృతి ఉంది. గత 500 సంవత్సరాలుగా ఇక్కడ మతసామరస్యం నెలకొనివుంది. అన్ని మతాలు, వర్గాల ప్రజలు పరస్పరం గౌరవించుకొంటూ కలిసిమెలసి బ్రతుకుతున్న చరిత్ర ఉంది. ఈ వాస్తవాలను గమనించకుండా హైదరాబాద్‌ను ప్రత్యేక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కొంత మంది డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ను వేరుచేసి ప్రత్యేక ప్రాంతంగా చేయడమం టే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమే. ఇదెంత అమానుషం! సభ్యతా సంస్క­ృతి లేని వారు మాత్రమే ఇలా చేస్తారు.